ఒమేగా క్యాన్సర్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో శుక్రవారం వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు ఉచిత క్యాన్సర్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ జీవన విధానంలో పరిణామాల కారణంగా అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయని ప్రజలు వీటిని నివారించడం కోసం వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.