AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేసేందుకు ఏపీ పోలీసులు రెడీ అవుతున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గుంటూరు మిర్చీ యార్డులో పర్యటించిన ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ యార్డు ఆవరణలో ఎటువంటి రాజకీయ సమావేశాలు అనుమతి లేదని.. జగన్ వచ్చే సమయంలో కూడా మైకులో ప్రచారం చేశామని పోలీసులు చెబుతున్నారు.