అద్దంకి నియోజకవర్గంలో 31 మంది మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి రవికుమార్ శుక్రవారం చిలకలూరిపేటలోని క్యాంపు కార్యాలయం నందు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 31 మంది గాను రూ.30,02,289 ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేసినట్లు చెప్పారు. ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి బాసటగా నిలుస్తుందని మంత్రి చెప్పారు.