అద్దంకిలో మైనర్ బాలుడు లారీ కింద పడి మృతి చెందిన ఘటనపై సీఐ సుబ్బరాజు సోమవారం స్పందించారు. మైనర్లకు వాహనాలు అప్పగించకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని లేదంటే గర్భశోకం తప్పదని ఆయన సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని కూడా హెచ్చరించారు.