అద్దంకి పరిధిలో బీటీ రోడ్లు నిర్మాణ పనులను శుక్రవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. పనుల నాణ్యతలో ఎక్కడ రాజీ పడవద్దు అని మంత్రి సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి రవికుమార్ ఆదేశించారు. నియోజకవర్గంలో ఇంకా రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలియజేశారు.