అద్దంకి మండలం, కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన నక్కా. శ్రీనివాసరావుకు త్రివేణి (36)తో వివాహం జరిగింది. డ్వాక్రా నగదు రూ. 20 వేలు జమ చేసేందుకు, ఈనెల 22 వ తేదీన ఉదయం 9 గంటలకు కెనరా బ్యాంక్ కు వెళ్ళి ఆ సమాచారాన్ని భర్తకు అందించింది. అనంతరం తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని, తన బంధువుల దగ్గర విచారించిన ఫలితం లేదని, ఆచూకీ తెలియలేదంటూ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేశామని అద్దంకి సీ. ఐ కృష్ణయ్య తెలిపారు.