బల్లికురవ మండలం కొప్పెరపాడు గ్రామానికి చెందిన రాజేష్ అనే విద్యార్థి సోమవారం అద్దంకిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో మంగళవారం వైసీపీ సమన్వయకర్త హనిమిరెడ్డి మరి ఇంటికి వెళ్లి పరామర్శించారు. రోడ్డు ప్రమాదం జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని హనిమిరెడ్డి కోరారు. వైసిపి పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.