కొరిశపాడు మండలంలోని రైతులందరూ పంట సాగు చేసే ముందు విత్తన శుద్ధిని తప్పనిసరిగా చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు సోమవారం మీడియా ప్రకటన ద్వారా తెలియచేశారు. విత్తన శుద్ధిని చేయటం వలన పంట దిగుబడి పెరుగుతుందని, పంటకు ఎండు తెగులు రాకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా రైతుకు పురుగులు మందు ఖర్చు తగ్గుతుందని శ్రీనివాసరావు తెలిపారు.