కొరిశపాడు మండలం మేదరమెట్ల లో గురువారం మధ్యాహ్నం 41 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు అవ్వటంతో ప్రజలు ఇళ్ల వద్దకే పరిమితమయ్యారు. గ్రామంలో ప్రధాన రహదారులన్నీ జన సంచారం లేకపోవడంతో నిర్మానుషంగా మారాయి. వ్యాపారస్తులు ఎండ దాటికి దుకాణాలకు పరదాలు కట్టుకున్నారు. అత్యవసరంగా పని మీద వెళ్లే ప్రజలు గొడుగులు, రుమాళ్ళతో బయటకు వచ్చారు.