అద్దంకి మండలం కలవకూరు చెరువులో మట్టి తవ్వకాలు చేస్తున్న జెసిబి యంత్రంతో పాటు మూడు ట్రాక్టర్లను బుధవారం అదుపులోకి తీసుకొని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కృష్ణయ్య తెలియజేశారు. స్వాధీన పరుచుకున్న వాహనాలకు జరిమానా విధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరైనా అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ కృష్ణయ్య హెచ్చరించారు.