అమృతలూరు మండలంలోని ప్యాపర్రు గ్రామంలో సొంగా సునీత, గోపాలం శివకుమారిలకు చెందిన గృహాలు ఇటీవల అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. దీంతో తెనాలి రెడ్ క్రాస్ ప్రతినిధులు శ్రీమన్నారాయణ, సాంబశివరావు స్పందించి రెండు కుటుంబాలకు వంటసామగ్రి కిట్లను ఆదివారం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి రెడ్ క్రాస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పాల్గొన్నారు.