బాపట్ల జిల్లా కోర్టుల సముదాయo లో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరిగింది. కార్యక్రమంలో 736 కేసులను పరిష్కరించడం జరిగింది. అందులో 32 సివిల్ కేసులు, 697 క్రిమినల్ కేసులు, 7 ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించడం జరిగింది. మొత్తము రూ. 98, 42, 989/- లు లావాదేవీలు జరిగినవి. న్యాయమూర్తులుగా బాపట్ల ఆరవ అదనపు జిల్లా జడ్జి కె. శ్యాం బాబు, జి వాణి పలువురు జడ్జీలు, కక్షిదారులుపాల్గొన్నారు.