విద్యారంగాన్ని అతలాకుతలం చేస్తున్న 117 జీవోను ఉపసంహరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం జరిగిన ఉపాధ్యాయ ధర్నాలో ఆమె మాట్లాడారు. పాఠశాలలను 9 రకాలుగా నెలకొల్పడం సరికాదని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. 117 జీవో రద్దు హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.