బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి శుక్రవారం పట్టణంలో పర్యటించారు. పట్టణంలో గత కొన్ని రోజులుగా త్రాగునీటిపై ఫిర్యాదులు రావటంతో వాటర్ ప్లాంట్ ను పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం నూరుశాతం అమలు చేసేందుకు సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత బాపట్లగా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని సూచించారు.