బాపట్ల: జిల్లా ఎస్పీతో డిజిపి హరీష్ కుమార్ గుప్తా సమీక్ష

52చూసినవారు
బాపట్ల: జిల్లా ఎస్పీతో డిజిపి హరీష్ కుమార్ గుప్తా సమీక్ష
రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా శనివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఎస్పిలు ఆపై స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, ఇతర పలు అంశాల గురించి సమీక్షించారు. ఈ సమావేశానికి బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి క్యాంప్ కార్యాలయం నుండి హాజరైనారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలను అరికట్టుట, సీసీ కెమెరాలు, డ్రోన్ ల ద్వారా నిఘా ఏర్పాటు చేసే విధానంపై చర్చించారు.

సంబంధిత పోస్ట్