పరిశ్రమల స్థాపనకు అన్ని వనరులు, అనుమతులు సమకూర్చాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఆదేశించారు. పరిశ్రమల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. పరిశ్రమలతో ఉత్పాదకత, ఉపాధి అవకాశాలు, ఆదాయ వనరులు పెరుగుతాయని జిల్లా కలెక్టర్ చెప్పారు. పరిశ్రమలు స్థాపించడానికి ముందుకువచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలన్నారు. చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.