బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డీపీఓ ప్రభాకర్, బాపట్ల తహశీల్దార్ సలీమా, ఎంపీడీవో బాబురావు పాల్గొన్నారు. సముద్రంలో ఆకస్మికంగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా స్పందించాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించారు. విపత్తుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కోరారు.