బాపట్ల: ప్రభుత్వ అవకాశాలతో ఉన్నత స్థాయికి ఎదగాలి: కలెక్టర్ మురళి

78చూసినవారు
బాపట్ల: ప్రభుత్వ అవకాశాలతో ఉన్నత స్థాయికి ఎదగాలి: కలెక్టర్ మురళి
ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ వెంకట మురళి అభినందించారు. శుక్రవారం బాపట్ల కలెక్టరేట్‌లో విద్యార్థులకు అవార్డులు, జ్ఞాపికలు అందజేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ సూచించారు. తొమ్మిది వసతి గృహాలు, పాఠశాలల నుంచి 19మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించడం సంతోషకరమన్నారు.

సంబంధిత పోస్ట్