బాపట్ల ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బేతపూడి, స్టువర్టుపురం గ్రామాలలో గురువారం బాపట్ల ప్రొహిబిషన్ సిఐ గీతిక సిబ్బందితో వెళ్లి నాటు సారా కేసుల్లో ఉన్న కుటుంబాలకు అవగాహన కల్పించారు. నాటు సారాయి తయారీ, అమ్మకం రవాణా వంటి చర్యలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ, వెదుల్లపల్లి ఎస్సై పి. భాగ్యరాజు , బాపట్ల ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.