కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమాన్ని బాపట్ల పట్టణం 33వ వార్డులో శనివారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రారంభించి ఇంటింటికీ వెళ్లి గత ఏడాది కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.