బీజేపీ నేతలకు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి శుక్రవారం రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా పాక్ తో పోరాడుతున్న భారత సైన్యం, ప్రధాని మోడీ, దేశం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా మందిరాల్లో రెండు రోజుల పాటు పూజలు నిర్వహించాలని సూచించారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశం సురక్షితంగా ఉండాలని ప్రార్థనలు చేయాలన్నారు.