ఇటీవల బాపట్ల పట్టణం లోని రైల్వే స్టేషన్ సమీపంలో ప్రైవేటు టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో రిటైర్డు రైల్వే ఉద్యోగి లక్ష్మి నారాయణ గురువారం తెల్లవారుఝామున మృత్యువాత పడ్డారు.గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతూ బుధవారం నల్లమోతు మాధవి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన వీరిరువురి జీవితాలు విషాదాంతం కావడం పట్ల వారి బంధువులు, స్థానికులు బాధను వ్యక్తం చేస్తున్నారు.