బాపట్ల పట్టణంలోని రైతు బజార్ స్థలాన్ని గురువారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పరిశీలించారు. రైతు బజార్ లోని మౌలిక వసతులు కల్పించడంతోపాటు నూతన భవన నిర్మాణాల పై వారు చర్చించారు. కావలసిన వసతులపై అధికారులతో చర్చించి ప్రణాళికలు తయారు చేయాలని వారు ఆదేశించారు.