ఎంపీడీఓ అద్దురి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, కర్లపాలెం మండలం పేరలి గ్రామ పంచాయతీ అధికారులు పాతపాలెం, మేకలవారిపాలెంలోని తాగునీటి సరఫరా వ్యవస్థకు మరమ్మతులు నిర్వహించారు. అనంతరం ఆయా ప్రాంతాలకు శుక్రవారం తాగునీటిని విడుదల చేశారు. స్థానికులు నీటి సరఫరా పునరుద్ధరణతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే గ్రామంలోని ఇతర ప్రాంతాల్లో కూడా మరమ్మతులు పూర్తి చేసి నీటి సరఫరాను మెరుగుపరుస్తామని అధికారులు తెలిపారు.