జాతీయ స్థాయిలో ఖ్యాతి సాధించిన దుగ్గిరాల

65చూసినవారు
జాతీయ స్థాయిలో ఖ్యాతి సాధించిన దుగ్గిరాల
చీరాల - పేరాల ఉద్యమం ద్వారా బాపట్ల జిల్లా ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చిరస్మరణీయులని, ఫోరమ్ ఫర్ బెటర్ కార్యదర్శి పిసి సాయిబాబు చెప్పారు. ఆదివారం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 135వ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపట్ల బోర్డు స్కూల్లో ఆయన విద్యాభ్యాసం చేశారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్