కర్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెంలో గురువారం స్వచ్చంద్రా - స్వచ్ఛదివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 11 గ్రామాల కార్యదర్శులు, క్లాప్ మిత్రులు, షెడ్ మిత్రులకు అవగాహన కల్పించారు. గ్రామ సర్పంచ్ గురపసాల వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ గ్రామాలను శుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దురి శ్రీనివాసరావు, ఈఓపీఆర్డీ ఇనంపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.