బాపట్ల నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అర్జీదారుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా చూస్తానని ఆయన తెలిపారు.