పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద గ్రానైట్ లారీ బోల్తా పడడంతో ముగ్గురు కూలీలు మృతిచెందారు. మృతులు పాలపర్తి శ్రీను(25), తాళ్లూరి ప్రభుదాస్(37), తమ్ములూరి సురేంద్ర (26 )గా గుర్తించారు. మార్టూరు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులకు సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు జరుపుతున్నారు.