బాపట్ల: అక్రమం వెంచర్లు వేసే వారిపై చర్యలు తీసుకోండి

51చూసినవారు
పట్టణీకరణ పేరుతో గ్రామీణ ప్రాంతాలలోని పంట పొలాలను నాశనం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు పర్రె కోటయ్య అన్నారు. నగరం మండలం సిరిపుడి పంచాయితీలో పచ్చని పంట పొలాలపై అక్రమంగా వెంచర్లు వేస్తూ అనధికారికంగా బుసక తోలుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. భూ హక్కులు రైతులకే ఉండేలా రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోకపోతే నిరసన చేపడతామని కోటయ్య హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్