ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర కళాశాల కబడ్డీ పోటీలు ఈనెల 22, 23వ తేదీల్లో నిర్వహించడం జరిగింది. బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జట్టు తృతీయ స్థానంతో ప్రతిభను చాటింది. ఎస్ వీరప్పయ్య రెడ్డి, పి లీలాశివ గణేష్ రెడ్డి ఈనెల 30వ తేదీన చెన్నై యూనివర్సిటీలో జరగబోయే విశ్వవిద్యాలయాల సౌత్ జోన్ కబడ్డీ పోటీలకు యూనివర్సిటీ తరఫున ఎంపికయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ పి ఆంజనేయులు అభినందనలు తెలియజేసారు.