కుటుంబ సాధికార సారథుల నియామకాలు ఈ నెల 20 లోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ పరిశీలకురాలు దాసరి ఉషారాణి అన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడమే ఈ నియామకాల ఉద్దేశమని, పార్టీ బలోపేతానికి శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలన్నారు.