చిలకలూరిపేట పట్టణ ములోని 38వ వార్డు జిడ్డు కాలనీ (గంగమ్మ సుగాలి కాలనీ)లో నెలకొన్న సమస్యలపై మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు శనివారం వార్డు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం పడుతున్నా వర్షాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో నుంచి నీరు రోడ్లమీదకు ప్రవహిస్తుందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందన్నారు.