చిలకలూరిపేట: మాజీ మంత్రి బంధువులపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు

56చూసినవారు
చిలకలూరిపేట: మాజీ మంత్రి బంధువులపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు
చిలకలూరిపేటలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు 'ప్రజా వేదిక' నిర్వహించారు. మార్కెట్ యార్డ్ సమీపంలోని సాయిబాబా గుడి వద్ద తమకున్న 10సెంట్ల స్థలాన్ని మాజీ మంత్రి విడుదల రజిని బంధువులు ఆక్రమించారని ఎమ్మెల్యేకు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితులతో మాట్లాడి వారికి న్యాయం చేయాలని, ఆక్రమణదారులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ సిబ్బందికి ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్