కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టం ముస్లిం మైనార్టీ హక్కులను హరించేవిగా సీపీఐ నేతలు ఆక్షేపించారు. చిలకలూరిపేటలో సీపీఐ ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ చట్టం ద్వారా ముస్లిం సమాజంపై దాడి చేయడమే కాక, ముస్లిం ధార్మిక, సామాజిక, సాంస్కృతిక సంస్థలను నాశనం చేయాలని కుట్రలు పన్నినట్లు ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులను రక్షించేందుకు మైనార్టీలు ఐక్యంగా పోరాడాలని పిలుపు ఇచ్చారు.