చిలకలూరిపేట పట్టణంలోని పొగాకు కేంద్రాన్ని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలు సకాలంలో దొరకక, సరైన సమయంలో పొగాకు కోయలేక, పండుటాకుగా మారిన పొగాకును కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో క్వింటాల్కు రూ. 120 పలికే పొగాకు, ఇప్పుడు పండుటాకు కావడంతో కొనుగోలు చేయడం లేదని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పుల్లారావు తెలిపారు.