చిలకలూరిపేట: బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

చిలకలూరిపేట భావనారుషి నగర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన చిన్నం ఆదిబాబును ఆసుపత్రిలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురువారం పరామర్శించారు. ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చిన ఆయన, కుటుంబ సభ్యులను ఆదరిస్తానని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందేలా వైద్యులను ఆదేశించారు. పూజ శ్రీనివాసరావు, జాలయ్య తదితర బాధితులను కలిసి ధైర్యం చెప్పారు.