చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండల ఎంపీడీవో కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని గురువారం మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులు, సొసైటీ సభ్యులతో మాట్లాడిన ఆయన, రక్తదాన ఆవశ్యకతపై యువతకు అవగాహన కల్పించాలని చెప్పారు.