రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని, యువత పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ సుభాని పిలుపునిచ్చారు. చిలకలూరిపేట సీపీఐ మాచర్ల కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి విస్మరించిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు లక్షల 38 వేల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.