గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినరూ. 40 వేల కోట్ల భూ దోపిడిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్రా కో కన్వీనర్ పెంటల బాలాజీ కోరారు. మంగళవారం చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో రాష్ట్రం భూ దోపిడికి గురైందని తెలిపారు. ప్రాజెక్టుల పేరు చెప్పి అమాయకులను వైసీపీ నాయకులు బెదిరించి, తక్కువ ధరకు వాళ్ల భూములు కబ్జా చేశారని ఆరోపించారు.