కరెంట్ షాక్ కు గురై శనివారం రమేశ్ మృతిచెందిన ఘటన నాదెండ్ల మండలం కనపర్రులో చోటు చేసుకుంది. వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన అనంతరం ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశాడు. ఈ క్రమంలో షాక్ తగిలి రమేశ్ కింద పడగా స్థానికులు వెంటనే చిలకలూరిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే రమేశ్ మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.