నాదెండ్ల మండలంలోని కనపర్రు గ్రామంలో జరిగిన ఘర్షణ కేసులో చెవుల నరేంద్ర అనే వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష, రూ. 3 వేల జరిమానా విధిస్తూ గురువారం కోర్టు తీర్పునిచ్చింది. 2018లో కనపర్రు గ్రామానికి చెందిన చీరాల అరవింద సాయి, అదే గ్రామానికి చెందిన చెవుల నరేంద్ర ఘర్షణ పడ్డారు. అరవింద సాయి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేశారు. వాదనలు విన్న ఏజేసీజే కోర్టు న్యాయమూర్తి స్వాతి నరేంద్రకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.