బోయపాలెం గురుకులంలో వ్యక్తిత్వ వికాస అవగాహన

84చూసినవారు
బోయపాలెం గురుకులంలో వ్యక్తిత్వ వికాస అవగాహన
యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలోని అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో గురువారం వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు నిర్వహించారు. నరేంద్ర సువర్ణ కుమారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ తదితర అంశాలపై సవివరంగా వివరిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబనపై మార్గనిర్దేశం చేశారు. అనంతరం క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్