చిలకలూరిపేట పట్టణంలోని లాడ్జీలు, ఆర్టీసీ బస్టాండ్లపై పోలీసులు గురువారం రాత్రి దాడులు నిర్వహించి తనిఖీ చేశారు. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో అనుమానితుల కోసం పోలీసులు ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. బస్టాండ్లో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల వివరాలు సేకరించారు. అన్ని లాడ్జీలను తనిఖీ చేసినట్లు అర్బన్ సీఐ రమేష్ తెలిపారు. లాడ్జీల రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు.