నాదెండ్ల సబ్స్టేషన్లో ఫీడర్ మరమ్మతుల కారణంగా మండలంలోని పలు గ్రామాలకు సోమవారం విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ఆ శాఖ అధికారి అశోక్ కుమార్ ఆదివారం తెలిపారు. చిరుమామిళ్ల, జంగాలపల్లి, సంక్రాంతి పాడు గ్రామాలకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.