రేపు నాదెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో స్వరూప రాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమంలో మండలంలోని ప్రజల సమస్యలు నేరుగా ఎమ్మెల్యేకి తెలపవచ్చని ఆమె కోరారు. కాబట్టి మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.