చిలకలూరిపేటలోని డిఆర్ఎన్ ఎస్ సి వి ఎస్ డిగ్రీ కళాశాల నాన్ టీచింగ్ రిటైర్డ్ ఉద్యోగులు కాకుమాను పుల్లారావు, వెంకట నరసమ్మ దంపతులు శనివారం కళాశాల అభివృద్ధి కోసం ఒక లక్ష రూపాయల విరాళం అందించారు. ఈ మొత్తాన్ని వారు చిలకలూరిపేట విద్య సంఘం అధ్యక్షులు తేళ్ల సుబ్బారావుకు అందజేశారు. సుబ్బారావు మాట్లాడుతూ, 40 సంవత్సరాలు కళాశాలలో పనిచేసిన ఈ దంపతులు లక్ష రూపాయల విరాళం ఇవ్వడం వారి అభిమానానికి నిదర్శనమని అన్నారు.