రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

63చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ఎడ్లపాడు మండల పరిధిలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిడమర్రుకి చెందిన కృష్ణ (31), రవి కిషోర్ (25) అనే ఇద్దరు కారులో వెళ్తున్నారు. మార్గం మధ్యలో కారు టైరు పంక్చర్ అవ్వడంతో టైరు మారుస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్