యడ్లపాడు మండలంలో గురువారం ఈదురు గాలులతోపాటు కురిసిన వర్షానికి విద్యుత్ శాఖకు రూ. 2లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ ఏఈఈ జెర్నీజయకర్ తెలిపారు. 15 విద్యుత్ స్తంభాలు, వాటికి అమర్చిన కండకర్లు, వైర్లు, కాసారాలు దెబ్బతిన్నాయన్నారు. దెబ్బతిన్న పరిక రాల స్థానంలో కొత్తవాటిని వెంటనే అమర్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారన్నారు.