నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం ఉదయం పేరాల- చిన్న రథం కూడలిలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నివాళులులర్పించారు. అనంతరం పేదలకి అల్పాహార పంపిణీ చేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రజ్ఞ హాస్పిటల్ వైద్యులు పి. శ్రీనివాస్ విచ్చేసారు. ఈ కార్యక్రమంలో నేతాజీ సేవా సమితి అధ్యక్షుడు చుండూరి కృష్ణమూర్తి, కార్యదర్శిపవని భాను చంద్రమూర్తి, రమేష్, రామారావు, నాగేశ్వరరావు, చంద్ర మౌళి తదితరులు పాల్గొన్నారు.