చీరాల పట్టణానికి చెందిన ఒక ఎన్నారై భారతదేశ సైనికుల సహాయ నిధికి రూ.5లక్షల గుప్త దానం చేశారు. చీరాల వన్టౌన్ సిఐ సుబ్బారావు ద్వారా ఆయన ఈ చెక్కును శనివారం జిల్లా ఎస్పి తుషార్ డూడీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సదరు దాతను అభినందించారు. దేశ భద్రత కోసం ప్రాణాలను అర్పిస్తున్న సైనికులకు విపత్కర సమయంలో ఉపయోగపడేలా సాయం అందజేయడం ముదావహమని ఎస్పీ కొనియాడారు. ఆ దాత చర్య స్ఫూర్తిదాయకమని చెప్పారు.